![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -22 లో..... గంగ తన తండ్రితో ఇంటికి వస్తుంది. అక్కడ జరిగింది మొత్తం వాళ్ళ అమ్మకి చెప్తుంది గంగ. ఇంకా నువ్వు ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదు.. బుద్దిగా పెళ్లి చేసి పంపిస్తానని పైడిరాజు అంటాడు. నాకు ఇప్పుడు అర్థం అయింది. నువ్వు ఎప్పుడు అసలు గంగ గురించి పట్టించుకోలేదు.. ఇప్పుడు ఏంటో తెగ పటించుకుంటున్నావ్ అంటేనే నాకు డౌట్ వచ్చిందని గంగ వాళ్ళ అమ్మ అంటుంది.
మరొకవైపు పెళ్లికి గంగ ఒప్పుకోవడం లేదని వీరు మనిషి వీరు దగ్గరికి వచ్చి చెప్తాడు. ఇక అక్కడే ఉన్న ఇషిక వాళ్ళకి ఒక ఐడియా ఇస్తుంది. చాలా బాగా చెప్పావ్ సిస్టర్ అని ఇషికని గొప్పగా పొగుడతాడు వీరు. ఆ తర్వాత గంగకి వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంది. పెద్దసారు ఇంట్లో వాళ్ళ ఒక్కొక్కరి గురించి వాళ్ళమ్మకి గంగ చెప్తుంది. అమ్మ నువ్వు వెళ్లి టాబ్లెట్ వేసుకోమని గంగ అంటుంది. ఆవిడ టాబ్లెట్ వేసుకోవడానికి వెళ్తుంది కానీ టాబ్లెట్స్ ఉండవు. టాబ్లెట్స్ అన్ని పైడిరాజు పారేస్తాడు. అదంతా వీరు వాళ్ళ ప్లాన్. ఆ తర్వాత మరుసటి రోజు గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. వాళ్ళ అమ్మ టాబ్లెట్స్ లేక కళ్ళు తిరిగి కిందపడిపోతుంది.... ఇదే కదా నాకు కావల్సిందని పైడిరాజు అనుకుంటాడు.
పైడిరాజు తన భార్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు పెద్దసారు ఇక గంగ రాదేమోనని డల్ గా వస్తుంటే.. పెద్దసారు అని గంగ పిల్వగానే అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగంలో గంగ తన తల్లి హాస్పిటల్ ఖర్చు మొత్తం వీరు మనిషి ఇస్తానని చెప్తాడు. ఇతనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని గంగతో పైడిరాజు అనగానే ఇక ఏం చెయ్యలేక నాకు ఈ పెళ్లి ఇష్టమే అని గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |